జిల్లాకు మూడు అంబులెన్స్‌లు

ABN , First Publish Date - 2021-01-27T05:11:00+05:30 IST

జిల్లా అభివృద్ధి నిధుల నుంచి సమకూర్చిన మూడు అంబులెన్స్‌లను భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జిల్లా యంత్రాంగానికి మంగళవారం ఆందజేశారు.

జిల్లాకు మూడు అంబులెన్స్‌లు
అంబులెన్స్‌లను ప్రారంభిస్తున్న ఎంపీ

భువనగిరి రూరల్: జిల్లా అభివృద్ధి నిధుల నుంచి సమకూర్చిన మూడు అంబులెన్స్‌లను భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జిల్లా యంత్రాంగానికి మంగళవారం ఆందజేశారు. రూ.12లక్షల నిఽధులతో ఒక్కో వాహనం సమకూర్చినట్లు తెలిపారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా కలెక్టరేట్‌ ఆవరణలో జెండా ఊపి అంబులెన్స్‌ వాహనాలను ప్రారంభించారు. ఈ అంబులెన్స్‌లు భువనగిరి, ఆలేరు, రామన్నపేట ఆస్పత్రుల్లో అత్యవసర సేవలు అందించనున్నాయి. తుర్కపల్లి మండలం రుస్తాపూర్‌ మల్లిఖార్జున స్వామి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆయనవెంట పార్టీ నియోజకవర్గ ఇంచార్జి బీర్ల ఐలయ్య,  ధనావతు శంకర్‌నాయక్‌ ఉన్నారు. అదే విధంగా వలిగొండ మండల కేంద్రంలో అర్రూరు పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ వాకిటి అనంతరెడ్డికి మాతృవియోగం కలిగింది. వారి కుటుంబ సభ్యులను ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పరామర్శించారు. ఆయనవెంట ఎంపీపీ నూతి రమే్‌షరాజు ఉన్నారు. 

Updated Date - 2021-01-27T05:11:00+05:30 IST