సిక్కోలులో 35 కరోనా పాజిటివ్ కేసులు
ABN , First Publish Date - 2020-05-23T09:52:26+05:30 IST
సిక్కోలులో ఇప్పటివరకు 35 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని జిల్లా కొవిడ్ అధికారి,
జిల్లా కొవిడ్ నోడల్ అధికారి జగన్నాథం
శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి : సిక్కోలులో ఇప్పటివరకు 35 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని జిల్లా కొవిడ్ అధికారి, ఏడీఎంహెచ్వో డాక్టర్ బి.జగన్నాథం తెలిపారు. ఇప్పటికే ఐదుగురు డిశ్చార్జి అయ్యారని, క్వారంటైన్ కేంద్రాల్లోనే మిగతా కేసులన్నీ నమోదయ్యాయని వివరించారు. చెన్నై నుంచి వచ్చిన మత్స్యకారులను ఇటీవల పరీక్షించగా పాజిటివ్ కేసులు బయటపడ్డాయని తెలిపారు. ఇస్కలపాలెం, కవిటి, ఇచ్ఛాపురం తదితర ప్రాంతాలకు చెందిన మత్స్యకారులు ఉన్న క్వారంటైన్ కేంద్రంలో పాజిటివ్ కేసులు వచ్చాయన్నారు. ట్రూనాట్లో పాజిటివ్ వస్తే.. మళ్లీ రివర్స్ ట్రాన్స్క్రిఫ్టేజ్ పాలిమరైజ్ చైన్ రియాక్షన్ పరీక్ష నిర్వహిస్తున్నామని చెప్పారు. శ్రీకాకుళం నగరంలో పుణ్యపువీధి, చౌదరి సత్యనారాయణ కాలనీలో ఇద్దరు వ్యక్తులకు శ్వాబ్ తీసి.. పరీక్షలకు పంపించామన్నారు. ఇంకా ఫలితాలు వెల్లడికావాల్సి ఉందని తెలిపారు.