జిల్లా క్రీడాకారిణికి గోల్డ్ మెడల్
ABN , First Publish Date - 2021-01-26T05:30:00+05:30 IST
ఈనెల 10వ తేదీ నుంచి బెంగళూరులో జరిగిన రెండవ ఆన్లైన్ ఇంటర్నేషనల్ కరాటే చాంపియన్షిప్ పోటీల్లో నెల్లూరులోని సంతపేటలో ఉన్న శ్రీ లక్ష్మీ ఇంగ్లీషు మీడియం పాఠశాల విద్యార్థిని నాగసాయి మోహిత బంగారు పతకం సాధించిందని ఆ పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసులు తెలిపారు.
నెల్లూరు(స్టోన్హౌస్పేట), జనవరి 26: ఈనెల 10వ తేదీ నుంచి బెంగళూరులో జరిగిన రెండవ ఆన్లైన్ ఇంటర్నేషనల్ కరాటే చాంపియన్షిప్ పోటీల్లో నెల్లూరులోని సంతపేటలో ఉన్న శ్రీ లక్ష్మీ ఇంగ్లీషు మీడియం పాఠశాల విద్యార్థిని నాగసాయి మోహిత బంగారు పతకం సాధించిందని ఆ పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసులు తెలిపారు. ఈ పోటీలో మన దేశంతోపాటు మలేషియా, థాయ్లాండ్, సింగపూరు తదితర దేశాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారని, పోటీల్లో తమ విద్యార్థిని సత్తా చాటడం ఆనందంగా ఉందన్నారు. ఆమెకు శిక్షణ ఇచ్చిన అశోక్కు అభినందనలు తెలిపారు.