మున్సిఫ్‌ కోర్టు కాంప్లెక్స్‌ను సందర్శించిన జిల్లా న్యాయమూర్తి

ABN , First Publish Date - 2021-04-17T06:05:33+05:30 IST

గోదావరిఖనిలోని మున్సిఫ్‌ కోర్టు కాంప్లెక్స్‌ను శుక్రవారం జిల్లా 6వ అదనపు న్యాయమూర్తి జీవీఎన్‌ భరతలక్ష్మి సందర్శించారు.

మున్సిఫ్‌ కోర్టు కాంప్లెక్స్‌ను సందర్శించిన జిల్లా న్యాయమూర్తి
కోర్టు ఆవరణలో పరిశీలన జరుపుతున్న జిల్లా న్యాయమూర్తి జీవీఎన్‌ భరతలక్ష్మి

కోల్‌సిటీ, ఏప్రిల్‌ 16: గోదావరిఖనిలోని మున్సిఫ్‌ కోర్టు కాంప్లెక్స్‌ను శుక్రవారం జిల్లా 6వ అదనపు న్యాయమూర్తి జీవీఎన్‌ భరతలక్ష్మి సందర్శించారు. గోదావరిఖనిలో సబ్‌కోర్టు ఏర్పాటుపై న్యాయమూర్తి పరిశీలన జరిపారు. ఇటీవల గోదావరిఖనికి సబ్‌ కోర్టు మంజూరుకావడం, నూతనంగా మంజూరైన సివిల్‌జడ్జి కోర్టును ఎక్కడ ఏర్పాటుచేయాలనే అంశంపై మున్సిఫ్‌కోర్టులోని స్థలాన్ని పరిశీలించారు. అదేవిధంగా ఆయాకోర్టుల్లో మౌలిక వసతులపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. న్యాయమూర్తి వెంట జూనియర్‌ సివిల్‌జడ్జి కోర్టు న్యాయమూర్తులు పర్వతపు రవి, టీఎస్‌పీ భార్గవి, జీఎస్‌ఎల్‌ ప్రియంక, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు బల్మూరి అమరేందర్‌రావు, శ్రీపతికుమార్‌, సురేష్‌కుమార్‌, నర్సయ్య ఉన్నారు.

Updated Date - 2021-04-17T06:05:33+05:30 IST