కోర్టు భవనాన్ని పరిశీలించిన జిల్లా జడ్జి
ABN , First Publish Date - 2022-05-24T04:37:05+05:30 IST
నియోజకవర్గ కేంద్రానికి జూనియర్ సివిల్ జడ్జి కం జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్టేట్ కోర్టు మంజూరు కావడంతో సోమవారం కోర్టు భవనాన్ని జిల్లా సెషన్ జడ్జి ప్రేమావతి, ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీ మహేష్లు పరిశీలించారు.
దేవరకద్ర, మే 23: నియోజకవర్గ కేంద్రానికి జూనియర్ సివిల్ జడ్జి కం జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్టేట్ కోర్టు మంజూరు కావడంతో సోమవారం కోర్టు భవనాన్ని జిల్లా సెషన్ జడ్జి ప్రేమావతి, ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీ మహేష్లు పరిశీలించారు. భవనంలో కావ ల్సిన వసతుల గురించి ఆమె అధికారులనడిగి తెలుసుకున్నారు. కోర్టుకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పించాలని సూచించారు. భవనానికి సం బంధించిన ప్లానింగ్ పేపర్లను పరిశీలించి వాస్తు ప్రకారంగా గదులను కేటాయిం చాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ జ్యోతి, ఎంపీపీ రమాదేవి, ఎస్సై భగవంతరెడ్డి, ఎంపీడీవో శ్రీనువాసులు, ఉప తహసీల్దార్ శివరాజు, పంచాయతీ ఈవో సీత్యానాయక్ తది తరులు పాల్గొన్నారు. అంతకుముందు జడ్జి ప్రేమావతిని తహసీల్దార్ జ్యోతి, ఎంపీపీ రమాదేవి శాలువాతో ఘనంగా సన్మానించారు.