21న జిల్లాస్థాయి ఎడ్లబండ్ల పోటీలు

ABN , First Publish Date - 2021-04-17T05:56:32+05:30 IST

గోరంట్ల మండలం కరావులపల్లి తండా అభయాంజనేయస్వామి గుడి వద్ద ఈనెల 21న ఎడ్లబండ్ల పోటీలు నిర్వహిస్తున్నట్టు నిర్వాహకుల సునీత శంకర్‌లాల్‌నాయక్‌ పేర్కొన్నారు.

21న జిల్లాస్థాయి ఎడ్లబండ్ల పోటీలు

పుట్టపర్తి, ఏప్రిల్‌ 16: గోరంట్ల మండలం కరావులపల్లి తండా అభయాంజనేయస్వామి గుడి వద్ద ఈనెల 21న ఎడ్లబండ్ల పోటీలు నిర్వహిస్తున్నట్టు నిర్వాహకుల సునీత శంకర్‌లాల్‌నాయక్‌ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతి ఏడాది శ్రీరామ నవమిని పండుగను పురస్కరించుకుని ఎడ్లబండ్ల పోటీలు నిర్వహిస్తున్నా మన్నారు. విజేతలకు మొదటి బహుమతి రూ.50వేలు, ద్వితీయ బహుమతి రూ.40వేలు, మూడవ బహుమతి రూ.30వేలు,నాల్గవ బహుమతి రూ.20వేలు నగదును అందిస్తామ న్నారు. పోటీలు ఉదయం  12గంటల నుండి సాయంత్రం 3గంటల వరకు ఉంటాయ న్నారు. కరనోనా నిబంధనల ప్రకారం పోటీల్లో పాల్గొనా లన్నారు. పోటీల్లో పాల్గొనే వారు రూ.200 రుసుము చెల్లించాలన్నారు. మరిన్ని వివరాల కోసం  9441765766ను సంప్ర దించాలన్నారు. ప్రాచీన సంప్రదాయాలను కొనసాగించేందుకే ఈ పోటీలను నిర్వహిస్తున్నా మన్నారు. ఈ కార్యక్రమంలో వెంగలమ్మచెరువు ఆదినారాయణరెడ్డి, వాసు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-17T05:56:32+05:30 IST