జిల్లా ఖోఖో జట్టు ఎంపిక పోటీలు ప్రారంభం
ABN , First Publish Date - 2021-03-05T06:52:09+05:30 IST
జిల్లా ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా సీనియర్ మహిళల ఖోఖో జట్టు ఎంపిక పోటీలు గురువారం నంద్యాలలో ప్రారంభమయ్యాయి.
నంద్యాల (ఎడ్యుకేషన్), మార్చి 4: జిల్లా ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా సీనియర్ మహిళల ఖోఖో జట్టు ఎంపిక పోటీలు గురువారం నంద్యాలలో ప్రారంభమయ్యాయి. పట్టణంలోని నూనెపల్లె మున్సిపల్ హైస్కూల్ క్రీడామైదానంలో జరిగిన ఎంపిక పోటీలకు పాఠశాల హెచ్ఎం చలపతి ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 100 మంది మహిళా క్రీడాకారిణిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఖోఖో సంఘం ఉపాధ్యక్షుడు జడ్ఎ్సపీ దివాకర్ మాట్లాడుతూ పోటీల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారిణిలను జిల్లా జట్టుకు ఎంపిక చేస్తామని కృష్ణా జిల్లా గుడివాడలో మార్చి నెల 12, 13, 14 తేదీలలో జరిగే రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పారు. జిల్లా ఖోఖో సీనియర్ పురుషుల జట్టు ఎంపిక పూర్తైందని, ఆత్మకూరులో పురుషుల జట్టుకు శిక్షణ శిబిరం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పీఈటీ ఎం ప్రభాకర్, పద్మావతి, శశికళ, తిరుపతి పాల్గొన్నారు.