రైతులకు దశలవారీగా స్ర్పేయర్ల పంపిణీ
ABN , First Publish Date - 2021-01-19T06:28:12+05:30 IST
ప్రవాసాంధ్రుల సహకారంతో నియోజకవర్గంలో 800మంది రైతులకు రాయితీతో తైవాన్ స్ర్పేయర్లు పంపిణీ చేస్తున్నామని, భవిష్యత్తులోనూ దశలవారీగా వాటిని అందిస్తామని శాసనసభ్యులు, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అఽఽధ్యక్షుడు ఏలూరి సాంబశివరావు చెప్పారు.
పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి
మార్టూరు, జనవరి 18 : ప్రవాసాంధ్రుల సహకారంతో నియోజకవర్గంలో 800మంది రైతులకు రాయితీతో తైవాన్ స్ర్పేయర్లు పంపిణీ చేస్తున్నామని, భవిష్యత్తులోనూ దశలవారీగా వాటిని అందిస్తామని శాసనసభ్యులు, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అఽఽధ్యక్షుడు ఏలూరి సాంబశివరావు చెప్పారు. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా సోమవారం మండలంలోని ఇసుకదర్శి ఏలూరి క్యాంపు కార్యాలయంలో ‘మన రైతన్న కోసం’ పేరుతో రైతులకు స్ర్పేయర్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మండల పార్టీ అధ్యక్షుడు తొండెపు ఆదినారాయణ అధ్యక్షత వహించగా అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దివంగత సీఎం ఎన్టీఆర్ విగ్రహానికి వారు పూలమాలలు వేశారు. అనంతరం ఎమ్మెల్యే ఏలూరి మాట్లాడుతూ నివార్ తుఫాన్ కారణంగా పంటలు నష్టపోయిన రైతులలో కొందరు ఆత్మహత్య చేసుకోవడం తనను కలచివేసిందన్నారు. మిరప రైతులను ఆదుకోవడానికి 53లక్షల మొక్కలను పంపిణీ చేశామని చెప్పారు. ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ రైతులకు కోసం ఏలూరి చేపట్టిన స్ర్పేయర్ల పంపిణీ అభినందనీయమన్నారు. కార్యక్రమంలో నాయకులు కోటపాటి సురేష్, పోపూరి శ్రీను, నాయుడు హనుమంతరావు, రంగయ్యచౌదరి, రావిపాటి సీతయ్య, తేలప్రోలు సాంబశివరావు పాల్గొన్నారు.