వైఎస్‌ఆర్‌ బీమా పంపిణీ

ABN , First Publish Date - 2020-05-22T10:56:26+05:30 IST

స్థానిక జీఎంఈ కాలనీలోని వైసీపీ కార్యా లయంలో గురువారం పలాస ఎమ్మెల్యే బాధిత కుటుంబానికి

వైఎస్‌ఆర్‌ బీమా పంపిణీ

జీఎంఈ కాలనీ(పలాస), మే 21: స్థానిక జీఎంఈ కాలనీలోని వైసీపీ కార్యా లయంలో గురువారం పలాస ఎమ్మెల్యే బాధిత కుటుంబానికి వైఎస్‌ఆర్‌ బీమా నగదు పత్రాలను అందజేశారు.  24వ వార్డు కొత్వా ల్‌వీధికి చెందిన ఎం.ధనుంజయ్‌రావు ప్రమాదవశాత్తు మృతిచెం దడంతో ఆయన భార్యకు వైఎస్‌ఆర్‌ బీమా పథకం కింద రూ.లక్ష  మంజూరైంది. కార్యక్రమంలో బల్ల గిరిబాబు, మల్లా సురేష్‌కుమార్‌ పాల్గొన్నారు.


 నాయీబ్రాహ్మణలను ఆదుకోవాలి

వజ్రపుకొత్తూరు:కరోనా వైరస్‌ వల్ల నాయీబ్రాహ్మణులకు 60 రోజు లు గా ఉపాధి లేకపోవడంతో ఆదుకోవాలని సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కె.కృ ష్ణారావు గురువారం పలాస ఎమ్మెల్యే డాక్టర్‌ అప్పలరాజు, తహసీల్దార్‌ నా రాయణమూర్తికి వినతిప త్రాన్ని అందించారు.


పలాస నియోజకవర్గంలోని 600 కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని తెలిపారు. ఉపాధి లేకపో వడంతో షాపుల అద్దె, విద్యుత్‌ బిల్లులు కట్టలేక పోతున్నట్లు పేర్కొన్నారు. కుటుంబాలను ఆర్థికంగా ఆదుకొనేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. 

Updated Date - 2020-05-22T10:56:26+05:30 IST