నవరత్నాలతో ‘పుర’ ప్రచారం!

ABN , First Publish Date - 2021-03-05T09:43:46+05:30 IST

పురపాలక ఎన్నికల్లో నవరత్న పథకాలనే వైసీపీ ప్రధాన ప్రచారాస్త్రంగా చేసుకుంది. ఈ తొమ్మిది హామీలతో పాటు.. 21 నెలల పాలనను చూసి ఓటేయాలని రాష్ట్ర

నవరత్నాలతో ‘పుర’ ప్రచారం!

వైసీపీ కరపత్రాల పంపిణీ


అమరావతి, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): పురపాలక ఎన్నికల్లో నవరత్న పథకాలనే వైసీపీ ప్రధాన ప్రచారాస్త్రంగా చేసుకుంది. ఈ తొమ్మిది హామీలతో పాటు.. 21 నెలల పాలనను చూసి ఓటేయాలని రాష్ట్ర ప్రజలను కోరింది. ఈ మేరకు నాలుగు పేజీల కరపత్రాన్ని పంపిణీ చేస్తోంది. ‘నగరాభివృద్ధిలో నవశకానికి శ్రీకారం.. జగనన్న పాలనలో అభివృద్ధి బంగారం’ శీర్షికతో ముద్రించిన ఈ కరపత్రంలో.. మంచి చేస్తున్న ప్రభుత్వానికి మద్దతును ఇవ్వాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఇంటికే పింఛన్లు, రేషన్‌ సరుకులు.. వార్డు సచివాలయాల ద్వారా ఇతర పౌరసేవలు, చదువు-బడి పేరిట కార్యక్రమాలు.. వైద్యం- ఆరోగ్యం, రైతు-వ్యవసాయం, అక్క చెల్లెమ్మల కోసం జగనన్న చేదోడు, ఎంఎ్‌సఎంఈ వైఎ్‌సఆర్‌ నవోదయం, పట్టణ, నగర ప్రజలకు తక్కువ ధరకు ప్లాట్లు, పట్టణాలు, నగరాల్లో పారిశుద్ధ్య కార్యాచరణ, అభివృద్ధి కార్యక్రమాలను ఇందులో వివరించారు. కమలాపురం, కుప్పంలను కొత్త మున్సిపాలిటీలుగా చేయడం.. మంగళగిరి, తాడేపల్లి పురపాలక సంఘాలను కలిపేసి మంగళగిరి-తాడేపల్లి మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయడాన్నీ ప్రస్తావించారు.

Updated Date - 2021-03-05T09:43:46+05:30 IST