త్రివర్ణ పతాకాల పంపిణీ

ABN , First Publish Date - 2022-08-10T04:23:14+05:30 IST

స్వాతంత్య్ర వజ్రోత్సవాల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అధికారులు, నాయకులు మంగళవారం త్రివర్ణ పతాకాలను పంపిణీ చేశారు.

త్రివర్ణ పతాకాల పంపిణీ
గాంధీ మూవీని తిలకిస్తున్న కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌, అధికారులు

ఆసిఫాబాద్‌ రూరల్‌, ఆగస్టు 9: స్వాతంత్య్ర వజ్రోత్సవాల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అధికారులు, నాయకులు మంగళవారం త్రివర్ణ పతాకాలను పంపిణీ చేశారు. జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణవాడ లో వజ్రోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం   స్వాతంత్ర సమరయోథులు దండనాయకుల శ్రీనివాసరావును  కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, అదనపు కలె క్టర్‌ రాజేశం, చాహత్‌బాజ్‌పాయ్‌లు శాలువాలతో ఘనంగా సన్మా నించారు. అనంతరం జాతీయ జెండాలను పంపిణీ చేశారు. అలాగే బీజేపీ నాయకులు హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమాన్ని నిర్వ హించారు.  వజ్రోత్సవాలు ప్రారంభం సందర్భంగా జిల్లా కలెక్టర్‌, అధికారులు, విద్యార్థులతో కలిసి ర్యాలీగా వెళ్లి కుమరం భీం సినిమా థియేటర్‌లో గాంధీ మూవీని ప్రారంభించి తిలకించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కాండ్రె విశాల్‌, నాయకులు సత్యనారాయణ, కిరణ్‌, లక్ష్మ ణ్‌, గణేష్‌, పవన్‌, మురళీ, నాగరాజు, ఉమేష్‌ పాల్గొన్నారు. 

లింగాపూర్‌: మండలంలో ఎంపీపీ సవిత, జడ్పీటీసీ రక్కబాయి, ఎంపీడీవో ప్రసాద్‌ ఆధ్వర్యంలో ఆజాదీకా అమృత్‌ కార్యక్రమంలో భాగంగా త్రివర్ణ పతాకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ శోభ, వైస్‌ ఎంపీపీ ఆత్మారాం, కార్యదర్శులు పాల్గొన్నారు. 

చింతలమానేపల్లి:  మండలంలోని వివిధ గ్రామ పంచాయతీలకు జాతీయ జెండాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ నాన య్య, ఎంపీడీవో మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు. 

తిర్యాణి: మండల కేంద్రంలో ఎంపీపీ శ్రీదేవి, జడ్పీటీసీ చంద్రశేఖర్‌   జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ గ్రామ పంచాయతీ సిబ్బంది ద్వారా జాతీయ జెండాలను ఇంటింటా పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

కౌటాల: మండల కేంద్రంతో పాటు తలోడి గ్రామాల్లో ఇంటింటికి జాతీయ జెండాలను మంగళవారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు మౌనీష్‌, శంకరమ్మ, తిరుపతి, కార్యదర్శులు కళాకసు, కవిత, రమణచారి, నాయకులు రవీందర్‌గౌడ్‌, శ్రీనివాస్‌, బాపు, రమేష్‌, సాయి తదితరులు పాల్గొన్నారు. 

వాంకిడి:  మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ అధికారులు  ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీ చేపట్టారు. ఆయా కార్యక్ర మాల్లో ఎంపీపీ ముండె విమలాబాయి, కార్యదర్శి విలాస్‌, బిసి గోవిం ద్‌, పంచాయతీ సిబ్బంది, వార్డు సభ్యులు పాల్గొన్నారు.  

కెరమెరి: మండలంలోని అన్ని గ్రామాల్లో త్రివర్ణ పతాకాలను ఎగురవేయాలని ఎంపీపీ మోతిరాం అన్నారు. ఎంపీడీవో సత్యనారా యణగౌడ్‌తో కలిసి అన్ని గ్రామ పంచాయతీ కార్యదర్శులకు జాతీయ జెండాలను పంపిణీ చేశారు. 

రెబ్బెన: మండల కేంద్రంలో  ఎంపీపీ సౌందర్య ఆనంద్‌, జడ్పీటీసీ సంతోష్‌, సర్పంచ్‌ ఆహల్యాదేవి జెండాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మధునయ్య, ఉప సర్పంచి శ్రీను, వార్డు మెంబర్లు భరద్వాజ్‌, రమేష్‌, గోపి, రాజేష్‌, బాలాజీ, సెక్రటరీ రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు. 

సిర్పూర్‌(టి):  సిర్పూర్‌(టి) గ్రామ పంచాయతీలో అన్ని వార్డుల్లో మంగళవారం సర్పంచ్‌ తఫిమా పర్వీన్‌, ఉప సర్పంచ్‌లు మహేష్‌లు జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాలను ఎగుర వేయాలని సూచించారు. 

Updated Date - 2022-08-10T04:23:14+05:30 IST