ప్రజల ఉపాధి మార్గాలు నిర్వీర్యం చేసిన జగన్‌

ABN , First Publish Date - 2022-08-10T06:19:51+05:30 IST

వైసీపీ ప్రభుత్వం అధికా రంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్‌ చేతగాని పాలనతో అన్ని వర్గాల ప్రజలకు ఉపాధి మార్గాలు నిర్వీర్యం చేశారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ పేర్కొన్నారు.

ప్రజల ఉపాధి మార్గాలు నిర్వీర్యం చేసిన జగన్‌
మహిళలకు కుట్టుమెషీన్లు అందజేస్తున్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌

ప్రజల ఉపాధి మార్గాలు నిర్వీర్యం చేసిన జగన్‌

ఎమ్మెల్యే గద్దె 

పటమట, ఆగస్టు 9 : వైసీపీ ప్రభుత్వం అధికా రంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్‌ చేతగాని పాలనతో అన్ని వర్గాల ప్రజలకు ఉపాధి మార్గాలు నిర్వీర్యం చేశారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం అశోక్‌నగర్‌లోని తూర్పు టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల సందర్భంగా నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళలకు రూ. 70 వేల విలువ చేసే పది కుట్టుమెషీన్లు గద్దె అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  తాను ఈ రోజు పది మంది మహిళలకు కుట్టుమెషీన్లు  అందజేశానని, ఆ మహిళలను జగన్‌ ప్రభుత్వం నుంచి మీకు ఏవైనా పథకాలు అందుతున్నాయా అంటే పది మందికి ఇద్దరు మాత్రమే వస్తున్నాయని, 8 మంది తమకు ఏ విధమైన పథకాలు రావడం లేదన్నారు. ఇంటి పన్నులు, కరెంటు బిల్లులు పెరిగాయా అంటే అందరూ కూడా తమకు ఐదు రెట్లు కరెంటు బిల్లులు పెరిగాయని చెప్పారన్నారు. దీనిని బట్టే జగన్‌ ఏ విధంగా దోచుకుంటున్నారో అర్థం అవుతుందని, కానీ జగన్‌ మాత్రం అందరికి ఇచ్చినట్లు పత్రికల్లో కోట్లాది రూపాయలతో ప్రకటనలు ఇస్తున్నారన్నారు. కార్పొరేటర్‌ ముమ్మనేని ప్రసాద్‌, దాసరి గాబ్రియేలు, గంగాధర్‌,  రాజేష్‌, చిట్టా నిర్మల, రాజ్యలక్ష్మి  పాల్గొన్నారు.

Updated Date - 2022-08-10T06:19:51+05:30 IST