అభ్యర్థులకు స్టడీ మెటీరియల్‌ పంపిణీ

ABN , First Publish Date - 2022-05-18T05:40:29+05:30 IST

జిల్లాకేంద్రంలోని కేసీఆర్‌ స్టడీ సర్కిల్‌లో టెట్‌, డీఎస్సీకి శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మంగళవారం స్టడీ మెటీరియల్‌ పంపిణీ చేసారు.

అభ్యర్థులకు స్టడీ మెటీరియల్‌ పంపిణీ
అభ్యర్థులకు స్టడీ మెటీరియల్‌ను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్‌రెడ్డి

గద్వాల క్రైం, మే 17 : జిల్లాకేంద్రంలోని కేసీఆర్‌ స్టడీ సర్కిల్‌లో టెట్‌, డీఎస్సీకి శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మంగళవారం స్టడీ మెటీరియల్‌ పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇటీవలే టెట్‌, ఎస్‌ఐ, కానిస్టేబుల్‌, గ్రూప్స్‌కు సంబంధించిన నోటిఫికేన్లు విడుదల చేసిన సందర్భంగా నిరుపేద అభ్యర్థులకు స్టడీసర్కిల్‌లో శిక్షణ ఇస్తు న్నట్లు తెలిపారు. దాతల సహకారంతో స్టడీ మెటీరియల్‌ అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా కష్టపడి చదివి గద్వాల పేరును నిలబెట్టాలని సూచించారు. తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు.


విగ్రహ ప్రతిష్ఠోత్సవానికి ఆహ్వానం

గద్వాల పీజేపీ క్యాంపులోని శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి ఆలయంలో గోపాలకృష్ణుడి విగ్రహం, ధ్వజస్తంభం ప్రతిష్ఠోత్సవానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిని ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానించారు. జిల్లాకేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం వారు ఎమ్మెల్యేను కలిశారు. ఈ నెల 18 నుండి 20వ తేదీ వరకు ఉత్సవాలకు హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు నాగులు యాదవ్‌ ఉన్నారు.

Updated Date - 2022-05-18T05:40:29+05:30 IST