ఆలయానికి వెండి సామగ్రి వితరణ
ABN , First Publish Date - 2021-11-28T05:28:28+05:30 IST
పట్టణం లోని ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయానికి బెంగుళూరుకు చెందిన హేమంత్కుమార్ కుటుంబ సభ్యులు ఒక కిలో వెండి సామగ్రి స్వామివారికి శనివారం వితరణ చేసి నట్లు ఆలయ ఈఓ పట్టెం గురు ప్రసాద్ తెలిపారు.
కదిరి, నవంబరు 27: పట్టణం లోని ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయానికి బెంగుళూరుకు చెందిన హేమంత్కుమార్ కుటుంబ సభ్యులు ఒక కిలో వెండి సామగ్రి స్వామివారికి శనివారం వితరణ చేసి నట్లు ఆలయ ఈఓ పట్టెం గురు ప్రసాద్ తెలిపారు. వెండి శఠారి, నాగభరణము, ఉద్దరిణి అందజేశార న్నారు. దాతలకు స్వామివారి ప్రత్యేక దర్శనంతో పాటు స్వామివారి చిత్రపటం, శేషవస్త్రం, ప్రసాదాలు అందజేసినట్లు తెలిపారు.