బాధిత కుటుంబానికి భద్రత చెక్కుల పంపిణీ

ABN , First Publish Date - 2021-07-25T06:33:46+05:30 IST

భద్రత స్కీం కింద మృతుడి భార్యకు రూ. 1.97లక్షలు, మృతుడి తండ్రి ముత్యా లప్పకు రూ. 2 లక్షల చెక్కును జిల్లా ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప తన చాంబర్‌లో శనివారం అందజేశారు.

బాధిత కుటుంబానికి భద్రత చెక్కుల పంపిణీ
చెక్కును అందజేస్తున్న జిల్లా ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప


అనంతపురం క్రైం, జూలై 24: ఇటీవల ఆనారోగ్యంతో నాల్గవ పట్టణ పోలీసు స్టేషనలో పనిచేస్తున్న 2013 బ్యాచకు చెం దిన కానిస్టేబుల్‌ ఉపేంద్ర మృతి చెందాడు. దీంతో భద్రత స్కీం కింద మృతుడి భార్యకు రూ. 1.97లక్షలు, మృతుడి తండ్రి ముత్యా లప్పకు  రూ. 2 లక్షల చెక్కును జిల్లా ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప తన చాంబర్‌లో శనివారం అందజేశారు. ఈ డబ్బును కుటుంబ అభివృ ద్ధికి వినియోగించుకోవాలని వారికి సూచించారు. కార్యక్రమంలో  ఏఓ రమేష్‌, మృతుడి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-07-25T06:33:46+05:30 IST