నేటి నుంచి బియ్యం కార్డుల పంపిణీ
ABN , First Publish Date - 2020-06-07T08:00:40+05:30 IST
జిల్లాలో 28,339 మందికి ఆదివారం నుంచి బియ్యం కార్డుల పంపిణీ జరుగుతుందని డీఎస్వో విజయరాణి తెలిపారు.
చిత్తూరు కలెక్టరేట్, జూన్ 6: జిల్లాలో 28,339 మందికి ఆదివారం నుంచి బియ్యం కార్డుల పంపిణీ జరుగుతుందని డీఎస్వో విజయరాణి తెలిపారు. స్పందన తదితర కార్యక్రమాల ద్వారా అందిన వినతుల మేరకు సర్వే జరిపి అర్హులను ఎంపిక చేసినట్లు చెప్పారు. వీటికి సంబంధించి బియ్యంకార్డుల ముద్రణ పూర్తవడంతో, వలంటీర్ల ద్వారా నూతన కార్డులు అందజేస్తామని పేర్కొన్నారు. ఆ మేరకు జిల్లాలో తెల్లరేషన్ కార్డుల సంఖ్య 11,67 లక్షలకు చేరిందని చెప్పారు.