పేదలకు బియ్యం, కూరగాయల పంపిణీ

ABN , First Publish Date - 2021-05-14T06:18:25+05:30 IST

పట్టణంలోని బూడిదదిన్నె ప్రాంతంలో నివాస ముంటున్న 50నిరుపేద కుటుంబా లకు గ్రీన్‌ భారత్‌ ఫౌండేషన్‌ ఆధ్వ ర్యంలో బియ్యం, కూరగాయ లను పంపిణీ చేశారు.

పేదలకు బియ్యం, కూరగాయల పంపిణీ
పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్న ఎంపీడీఓ, టీచర్‌ శంకర్‌నారాయణ

గోరంట్ల, మే 13 : పట్టణంలోని బూడిదదిన్నె ప్రాంతంలో నివాస ముంటున్న 50నిరుపేద కుటుంబా లకు గ్రీన్‌ భారత్‌ ఫౌండేషన్‌ ఆధ్వ ర్యంలో బియ్యం, కూరగాయ లను పంపిణీ చేశారు. కరోనా విస్తరిస్తూ జనజీవనాన్ని అతలాకుతలం చేస్తుం టే గ్రీన్‌భారత్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ రెడ్డివారి శంకర్‌నారాయణ నిరుపేద లను ఆదుకోవడా నికి ముందుకొచ్చా రు. ఉపాధి పనులు లేక ఇబ్బంది ప డుతున్న వారిని గుర్తించి ఒక్కొక్కరికి 6కిలోల బియ్యం, కూరగాయల కిట్‌లను సమకూర్చారు. ఎంపీడీఓ అంజి నప్ప,  వైసీపీ పట్టణ కన్వీనర్‌ ధనుంజయరెడ్డి చేతులమీదుగా పేదలకు వాటిని పంపిణీ చేశారు. కార్యక్రమంలో డా.బాషా, టీచర్‌ పక్కీరనాయక్‌ ఫౌండే షన్‌ సభ్యులు శివప్ప, నరేష్‌, వేణు, కిషోర్‌ నాయక్‌, శేషు, వెంకటేశ్‌, మారప్ప తదిత రులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-14T06:18:25+05:30 IST