పారిశుధ్య కార్మికులకు బియ్యం, నగదు పంపిణీ

ABN , First Publish Date - 2020-04-10T11:26:27+05:30 IST

మండలంలోని మహ్మద్‌నగర్‌ గ్రామంలో పారిశుధ్య కార్మికులకు గురువారం జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ దఫేదార్‌

పారిశుధ్య కార్మికులకు బియ్యం, నగదు పంపిణీ

నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 9 : మండలంలోని మహ్మద్‌నగర్‌ గ్రామంలో పారిశుధ్య కార్మికులకు గురువారం జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ దఫేదార్‌ శోభ 25 కిలోల బియ్యం, వెయ్యి రూపాయల నగదును పంపిణీ చేశారు. గ్రామ పంచాయతీలో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులకు ఒక్కొ క్కరికి 25 కిలోల బియ్యం, వెయ్యి రూపాయల నగదుతో పాటు మాస్కులను ఉచితంగా అంద జేశారు. అలాగేడ్వాక్రా మహిళా సంఘాలు తయారు చేసిన మాస్కులను స్వయం సహాయక సంఘాలకు అందజేశారు. కరోనా వైరస్‌ ప్రభావంతో లాక్‌డౌన్‌ అమలులో ఉండటంతో గ్రామ పంచాయతీ తరఫున వీటిని పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నివారణ అయ్యేంత వరకు స్వీయ నిర్బంధంలో ఉండాలని సూచించారు. గ్రామంలో ఎవ్వరు బయటకు రాకుండా, నిత్యావసర సరుకులకు మాత్రమే కుటుంబానికి ఒక్కరూ చొప్పున బయటకు రావా లన్నారు. ఈ కార్య క్రమంలో సర్పంచ్‌ దఫెదార్‌ బాలమణి, పంచాయతీ కార్యదర్శి రఘుపతి రెడ్డి, తదితరులున్నారు.

Updated Date - 2020-04-10T11:26:27+05:30 IST