నేటి నుంచి రేషన్‌ సరుకుల పంపిణీ

ABN , First Publish Date - 2020-10-20T05:30:00+05:30 IST

జిల్లాలోని రేషన్‌ కార్డుదారులకు మంగళవారం నుంచి 14వ విడత సరుకుల పంపిణీ ప్రారంభమవుతుంది. జిల్లాలోని 9,29,090 బియ్యం కార్డుదా రులకు ఈనెల 27 వరకు ప్రతి రోజు ఉదయం 6 నుంచి సాయంత్రం

నేటి నుంచి రేషన్‌ సరుకుల పంపిణీ

నెల్లూరు(హరనాథపురం), అక్టోబరు 19 : జిల్లాలోని రేషన్‌ కార్డుదారులకు మంగళవారం నుంచి  14వ విడత సరుకుల పంపిణీ ప్రారంభమవుతుంది. జిల్లాలోని 9,29,090 బియ్యం కార్డుదా రులకు ఈనెల 27 వరకు ప్రతి రోజు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పంపిణీ చేస్తారు. బీపీఎల్‌ కార్డులోని ఒక్కో సభ్యుడికి ఐదు కిలోల బియ్యం, ఒక్కో కార్డుకు కిలో శనగలు ఉచితంగా ఇస్తారు. కొవిడ్‌ దృష్ణ్యా అధికారులు షాపుల వద్ద మార్కింగ్‌, శానిటైజర్లను ఏర్పాటు చేయిస్తున్నారు. రోజుకు 50 నుంచి 100 కార్డులకు తేదీల వారీగా కూపన్లు  అందజేస్తారు.


డీలర్‌కు బియ్యం అమ్మితే చర్యలు 

 కార్డుదారులు  తీసుకున్న నిత్యావసర సరుకులను డీలర్లకుగానీ, దళారులకుగానీ అమ్మితే చర్యలు తీసుకుంటాం. దుర్వినియోగానికి పాల్పడిన కార్డుదారుల కార్డును రద్దు  చేస్తాం. క్రిమినల్‌ చర్యలు తీసుకుంటాం. కార్డుదారులు కరోనా జాగ్రత్తలు పాటిస్తూ సరకులు తీసుకోవాలి. సామాజిక దూరం తప్పకుండా పాటించాలి. 

- బాలకృష్ణారావు, డీఎస్వో

Updated Date - 2020-10-20T05:30:00+05:30 IST