ఎమ్మెల్యే రోజా వ్యతిరేకవర్గానికి పదవుల పంపకం
ABN , First Publish Date - 2022-02-04T21:58:24+05:30 IST
నగరి నిఎమ్మెల్యే రోజా వ్యతిరేకవర్గానికి పదవులు
తిరుపతి: నగరి ఎమ్మెల్యే రోజా వ్యతిరేకవర్గానికి పదవులు లభించాయి. నగరి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కేజీ కుమార్ సతీమణి శాంతికి ఈడిగ కార్పొరేషన్ చైర్మన్ పదవి లభించింది. నిండ్ర ఎంపీపీ ఎన్నికల్లో రోజాకి వ్యతిరేకంగా గట్టిపోటీ ఇచ్చిన రెడ్డివారి చక్రపాణిరెడ్డి శ్రీశైలం బోర్డు చైర్మన్గా ప్రభుత్వం నియమించింది. దీంతో రోజాపై రాజకీయంగా వ్యతిరేక వర్గం ఆధిపత్యం సంపాదించనట్లయింది. నగరి నియోజకవర్గంలోని 5 మండలాల్లో రోజా వ్యతిరేకవర్గం గట్టిపోటీ ఇస్తోంది. దీంతో ఎమ్మెల్యే రోజా అయోమయంలో పడ్డారు. పార్టీ కీలక నేతలపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.