పారిశుధ్య కార్మికులకు మాస్కుల పంపిణీ

ABN , First Publish Date - 2021-04-21T05:38:10+05:30 IST

స్థానిక ఎంక్యూ ఏగ్లోబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నగర పంచాయతీ కార్యాలయంలో పారిశుధ్య కార్మికులకు, గ్లౌజులు, మాస్కులు పంపిణీ చేశారు.

పారిశుధ్య కార్మికులకు మాస్కుల పంపిణీ
కార్మికులకు గ్లౌజులు, మాస్కులు పంపిణీ చేస్తున్న దృశ్యం

పెనుకొండ, ఏప్రిల్‌ 20: స్థానిక ఎంక్యూ ఏగ్లోబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నగర పంచాయతీ కార్యాలయంలో పారిశుధ్య కార్మికులకు, గ్లౌజులు, మాస్కులు  పంపిణీ చేశారు. బుధవారం స్థానిక నగర పంచాయతీ కార్యాలయంలో కమిషనర్‌ వెంకటరాముడు, ట్రస్ట్‌ చైర్మన కలీముల్లా చేతులమీదుగా కార్మికులకు మాస్కులు, చేతి గ్లౌజులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కలీముల్లా మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ధైర్యంగా విధులు నిర్వహించిన ఫ్రంట్‌లైన వారియర్స్‌ అయిన కార్మికులకు మాస్కులు, గ్లౌజులు పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం నగర పంచాయతీ కమిషనర్‌గా బాధ్యతలు తీసుకున్న వెంకటరాముడును ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాధన కమిటీ కన్వీనర్‌ రవూఫ్‌, కిరణ్‌, గంగాధర్‌, సమీవుల్లా, సెడ్స్‌ బాష, అక్రంఖాన, సురేష్‌, వెంకటరాముడు, ఆదిల్‌, అయూబ్‌ఖాన, లాయర్‌ శ్రీనివాసులు, మునిసిపల్‌ సిబ్బంది ఉద్యోగులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-04-21T05:38:10+05:30 IST