కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
ABN , First Publish Date - 2022-05-18T05:57:18+05:30 IST
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
దౌల్తాబాద్/దోమ/మేడ్చల్ అర్బన్, మే 17: దౌల్తాబాద్ మండలంలోని అంతారంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ఆదేశానుసారం పలువురు లబ్ధిదారులకు మంగళవారం కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసినట్లు జడ్పీటీసీ కోట్ల మహిపాల్, సర్పంచ్ శ్రీకాంత్రెడ్డి తెలిపారు. ఎంపీటీసీ బసంతమ్మ, వెంకటప్ప, కటిఎ కాశీనాథ్, రాజురెడ్డి, నరోత్తంరెడ్డి, డీటీ పాషా తదితరులు పాల్గొన్నారు. కాగా, ఈ నెల 18న దోమ మండల పరిషత్ కార్యాలయంలో 233 మంది లబ్దిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేయనున్నట్లు ఎంపీపీ అనసూయ తెలిపారు. అదేవిధంగా సర్పంచ్ విష్ణువర్ధన్రెడ్డి మూడుచింతలపల్లి మండలం జగ్గంగూడ-సంపన్బోల్ గ్రామాలకు చెందిన చింతల లలితకు రూ. 45వేలు, బాలకృష్ణకు రూ.60వేల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. గ్రామస్తులు ప్రవీణ్గౌడ్, రమేష్, సురేందర్రెడ్డి, సాయిబాబు, సుధాకర్, బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.