అనాథ చిన్నారులకు ఎఫ్‌డీ బాండ్లు పంపిణీ

ABN , First Publish Date - 2021-06-15T04:49:30+05:30 IST

కొవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పో యి అనాథలైన నలుగురు చిన్నా రులకు రూ.10 లక్షల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ బాండ్లను కలెక్టర్‌ హరి కిరణ్‌ అందచేశారు.

అనాథ చిన్నారులకు ఎఫ్‌డీ బాండ్లు పంపిణీ
ఎఫ్‌డీ బాండ్లను అందజేస్తున్న కలెక్టర్‌ హరికిరణ్‌

కడప (కలెక్టరేట్‌), జూన్‌ 14 : కొవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పో యి అనాథలైన నలుగురు చిన్నా రులకు రూ.10 లక్షల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ బాండ్లను కలెక్టర్‌ హరి కిరణ్‌ అందచేశారు. సోమవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబరులో మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ తిరుపాల్‌ రెడ్డితో కలిసి కలెక్టర్‌ అందజేశారు. కరోనాతో మృతి చెందిన ప్రొద్దుటూరు రూరల్‌కు చెందిన బి.నీలకంఠారెడ్డి కవల పిల్లలు దీపిక, ధీరజ్‌రెడ్డి, పులివెందుల మండలం పెద్ద రంగాపురానికి చెందిన జి.శ్రీనివాసరెడ్డి, వెంకటరోషమ్మ దంపతుల కుమార్తె  వెంకటస్వాతి, ఓబులవారిపల్లి  మండలం కొర్లకుంటకు చెందిన ఆంజనేయరెడ్డి, వాణి దంపతుల కుమార్తె అనూషలకు ప్రభు త్వం మంజూరు చేసిన రూ.10 లక్షల సాయాన్ని బాండ్ల రూపంలో అందజేశారు. కార్యక్రమంలో జేసీ సాయికాంత్‌వర్మ, ఐసీడీఎస్‌ పీడీ పద్మజ, ఏపీడీ నిర్మల, డాక్టర్‌ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-15T04:49:30+05:30 IST