విజయవాడ: ప్రసాదంపాడులో నిత్యావసరాల పంపిణీ
ABN , First Publish Date - 2020-04-10T17:52:33+05:30 IST
లాక్ డౌన్ నేపథ్యంలో విజయవాడ సమీపంలోని...
విజయవాడ: లాక్ డౌన్ నేపథ్యంలో విజయవాడ సమీపంలోని ప్రసాదంపాడులో పనులులేక ఇళ్లకే పరిమితమైన పేదలు, కూలీలకు ఐక్య సేవాసమితి ఆధ్వర్యంలో 6వేల మందికి నిత్యావసరాల సరుకులు పంపిణి చేశారు. ఇక్కడ పేదలు, రోజువారి కార్మికులు పస్తులుంటున్నారు. ఈ నేపథ్యంలో స్వచ్చంధ సంస్థలు, దాతలు ముందుకొచ్చి సహాయం చేస్తున్నారు. నెల రోజులకు సరిపడా బియ్యం, పప్పులు, కూరగాయలు అందజేస్తున్నారు.