రంజాన్‌ మాసం సందర్భంగా నిత్యావసర సరుకుల పంపిణీ

ABN , First Publish Date - 2021-04-13T07:24:25+05:30 IST

పవిత్ర రంజాన్‌ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో సోమవారం ఖానాపూర్‌లోని నిరుపేద ముస్లింలకు జామాతే ఇస్లామి హింద్‌ సంస్థ ఆద్వర్యంలో నిర్వహించిన బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రేఖానాయక్‌ ప్రారంబించారు.

రంజాన్‌ మాసం సందర్భంగా నిత్యావసర సరుకుల పంపిణీ
ముస్లింలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే రేఖానాయక్‌

ఖానాపూర్‌, ఏప్రిల్‌ 12 : పవిత్ర రంజాన్‌ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో సోమవారం ఖానాపూర్‌లోని నిరుపేద ముస్లింలకు జామాతే ఇస్లామి హింద్‌ సంస్థ ఆద్వర్యంలో నిర్వహించిన బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రేఖానాయక్‌ ప్రారంబించారు. ఈ సందర్భంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్న సంస్థ నిర్వాహాకులను ఎమ్మెల్యే అభినందించారు. 

మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే రేఖానాయక్‌ లబ్దీదారులకు సిఎంఆర్‌ఎప్‌ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా పెంబి మండలంలోని నాగాపూర్‌, మందపెల్లి గ్రామాలకు చెందిన పలువురికి సిఎంఆర్‌ఎప్‌ ద్వారా మంజూరి అయిన చెక్కులను వారి వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ అంకం రాజేందర్‌, ఖానాపూర్‌, పెంబి మండలాల టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు తాళ్ళపెల్లి రాజగంగన్న, పుప్పాల శంకర్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా నాయకులు కొక్కుల ప్రదీప్‌, గొర్రె గంగాధర్‌, ద్యావతి రాజేశ్వర్‌, వోల్గుల వెంకటేష్‌, తదితరులున్నారు. 

Updated Date - 2021-04-13T07:24:25+05:30 IST