నిత్యావసర సరుకుల పంపిణీ
ABN , First Publish Date - 2020-04-09T11:16:09+05:30 IST
కరోనా మహమ్మారిని కట్టడికి లాక్డౌన్ కొనసాగుతున్న దృష్ట్యా నిరుపేదలు నిత్యావసర సరకులు లేక ఇబ్బందులు పడుతున్నారు
బాన్సువాడ టౌన్, ఏప్రిల్ 8: కరోనా మహమ్మారిని కట్టడికి లాక్డౌన్ కొనసాగుతున్న దృష్ట్యా నిరుపేదలు నిత్యావసర సరకులు లేక ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని స్వర్ణకార సంఘం సభ్యులు నిరుపేద కుటుంబాలకు నూనె, పప్పు, ఇతర నిత్యావసర వస్తువులను అందజేశారు. రెండు రోజుల్లో 60 కుటుంబాలకు నిత్యావసర వస్తువులను అందజేసినట్లు సంఘ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ జంగం గంగాధర్, స్వర్ణకార సంఘం అధ్యక్షుడు సత్యం చారి, నార్ల సురేష్ గుప్త, నార్ల ఉదయ్, రమణ, బాబుచారి, ప్రభాకర్చారి తదితరులున్నారు.