విమ్స్కు రూ.లక్ష విలువైన మందులు వితరణ
ABN , First Publish Date - 2021-05-08T05:01:48+05:30 IST
విమ్స్ ఆస్పత్రిలో కరోనా రోగులకు అవసరమైన మందులను బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్ రాజు, పార్టీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు మేడపాటి రవీంద్రలు శుక్రవారం అందజేశారు.
విశాఖపట్నం, మే 7(ఆంధ్రజ్యోతి): విమ్స్ ఆస్పత్రిలో కరోనా రోగులకు అవసరమైన మందులను బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్ రాజు, పార్టీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు మేడపాటి రవీంద్రలు శుక్రవారం అందజేశారు. వీరు ఇద్దరు విమ్స్ డైరెక్టర్ డాక్టర్ సత్యప్రసాద్ను కలిసి లక్ష రూపాయల విలువైన ఫోండా ఫ్లో, మెప్రెస్సో ఇంజక్షన్లను అప్పగించారు. వాటిని అవసరమైన పేద రోగులకు వినియోగించాలని కోరారు. ఇతర స్నేహితుల సహకారంతో వాటిని సమకూర్చామని వివరించారు.