లబ్ధిదారులకు డీసీసీబీ రుణాల పంపిణీ
ABN , First Publish Date - 2020-06-01T09:58:40+05:30 IST
వ్యాపార రంగాన్ని ప్రోత్సహించేందుకు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఆధ్వర్యంలో రుణాలు పంపిణీ చేయడం అభినందనీయమని విద్యుత్ శాఖ మంత్రి
నల్లగొండ : వ్యాపార రంగాన్ని ప్రోత్సహించేందుకు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఆధ్వర్యంలో రుణాలు పంపిణీ చేయడం అభినందనీయమని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్షరెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం ఆయన డీసీసీబీలో వ్యాపార రుణాల స్కీంను లాంఛనంగా ప్రారంభించి 16మంది లబ్ధిదారులకు రూ.కోటి అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యాపారులు, రైతులు రుణాలు పొంది ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు.
డీసీసీబీ చైర్మన్ మహేందర్రెడ్డి మాట్లాడుతూ రూ.50వేల నుంచి రూ.10లక్షల వరకు రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. పీఏసీఎ్సల నుంచి మరో పదిరోజుల పాటు పంట రుణాలు అందించనున్నట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని పీఎసీఎస్ పరిధిలోని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, బ్యాంక్ వైస్ చైర్మన్ ఏసీరెడ్డి దయాకర్రెడ్డి, డైరెక్టర్ పాశం సంపత్రెడ్డి, మదన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.