విద్యార్థులకు రాగిజావ పంపిణీ

ABN , First Publish Date - 2022-08-18T03:57:29+05:30 IST

ఎర్రగొండపాలెం మండలంలో 60 పాఠశాలల్లో బుధవా రం సత్యసాయి అన్నపూర్ణ మద్దనహళ్లి ట్రస్ట్‌ వ్డారు విద్యార్థులకు రాగి జావను పంపిణీ చే శారు.

విద్యార్థులకు రాగిజావ పంపిణీ

60 పాఠశాలల్లో అమలు

సరఫరాకు ముందుకొచ్చిన 

సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్‌ 

ఎర్రగొండపాలెం,  ఆగస్టు 17 : ఎర్రగొండపాలెం మండలంలో 60 పాఠశాలల్లో బుధవా రం సత్యసాయి అన్నపూర్ణ మద్దనహళ్లి  ట్రస్ట్‌ వ్డారు విద్యార్థులకు రాగి జావను పంపిణీ చే శారు. మొత్తం 8200 మంది బాలబాలికలకు పోషకాహార విలువలున్న రాగిజావను అందిం చేందుకు ట్రస్ట్‌ వారు ముందుకొచ్చారని ఎం ఈవో ఆంజనేయులు తెలిపారు. బుధవారం కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి వి ద్యార్థినీవిద్యార్థులకు రాగిజావను అందజేశారు. 10 గ్రాముల రాగిపిండి, 5 గ్రాములు ఆర్గానిక్‌ బెల్లం కలిపి జావను పంపిణీ చేయించినట్లు తెలిపారు. రోజు మార్చి రోజు అందజేస్తామని చెప్పారు. పట్టణంలోని బీసీ పాఠశాల, వేగినాటికోటయ్యనగర్‌ పాఠశాలలో రాగిజావ పంపిణీని ఆయన పర్యవేక్షించారు. రాగిజావ తాగడం వలన విద్యార్థులు ఆరోగ్యంగా ఉం టారని తెలిపారు.  సత్యసాయి అన్నపూర్ట ట్రస్టు సభ్యులకు ఎంఈవో, హెచ్‌ఎం వెంక టేశ్వర్లు, ఉపాధ్యాయులు రత్తయ్య, సుబ్బా రావు, మహేశ్వరి కృతజ్ఞతలు తెలిపారు. 


Updated Date - 2022-08-18T03:57:29+05:30 IST