హెడ్కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు చెక్కు పంపిణీ
ABN , First Publish Date - 2020-06-28T07:07:46+05:30 IST
అనారోగ్యంతో మరణించిన హెడ్కానిస్టేబుల్ కుటుంబానికి శనివారం జిల్లా ఎస్పీ రంజన్రతన్కుమార్ ఆ శాఖ సంక్షేమ నిధి ద్వారా మంజూరైన చెక్కును
గద్వాలక్రైం, జూన్ 27: అనారోగ్యంతో మరణించిన హెడ్కానిస్టేబుల్ కుటుంబానికి శనివారం జిల్లా ఎస్పీ రంజన్రతన్కుమార్ ఆ శాఖ సంక్షేమ నిధి ద్వారా మంజూరైన చెక్కును అందజేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని స్పెషల్ బ్రాంచ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న హెడ్కానిస్టేబుల్ గోవిందు అనారోగ్యంతో గత ఏడాది నవంబర్లో మృతిచెందాడు. అతని కుటుంబ సభ్యులకు పోలీస్ సంక్షేమనిధిలోని భద్రత ఎక్స్గ్రేషియా ద్వారా రూ. 4లక్షల చెక్కును మృతుడి భార్య రాధకు అందజేశారు.