నేటి నుంచి చెక్కుల పంపిణీ

ABN , First Publish Date - 2020-07-02T11:04:59+05:30 IST

మండల కేంద్రమైన కొండాపురం గ్రామానికి చెందిన పునరావాస పరిహారం చెక్కులను గురువారం నుంచి పంపిణీ చేయనున్నారు

నేటి నుంచి చెక్కుల పంపిణీ

కొండాపురం, జూలై 1: మండల కేంద్రమైన కొండాపురం గ్రామానికి చెందిన పునరావాస పరిహారం చెక్కులను గురువారం నుంచి పంపిణీ చేయనున్నారు. గతంలో ఇచ్చిన 200 చెక్కులకు గాను నిధులు జమ కాని వాటికి తిరిగి చెక్కులను ఇవ్వనున్నట్లు జమ్మలమడుగు ఆర్డీఓ నాగన్న తెలిపారు. వ్యాలిడిటీ చెల్లకపోవడంతో పాత చెక్కులు తీసుకొస్తే రూ.6.75 లక్షలతో తిరిగి కొత్త చెక్కులు ఇస్తామని ఆర్డీఓ తెలిపారు. అదేవిధంగా శుక్రవారం ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి చేతులమీదుగా చెక్కుల ప్రక్రియ ప్రారంభిస్తామని ఆర్డీఓ తెలిపారు. 

Updated Date - 2020-07-02T11:04:59+05:30 IST