సచివాలయ మహిళా పోలీసులకు సెల్‌ఫోన్ల పంపిణీ

ABN , First Publish Date - 2021-08-06T06:35:01+05:30 IST

మండలంలోని గ్రామసచివాలయంలో విధులు నిర్వహిస్తున్న 14మంది మహిళ పోలీసులకు ఎంపీడీఓ అశోక్‌కుమార్‌రెడ్డి సెల్‌ ఫోన్లను గురువారం పంపిణీ చేశారు.

సచివాలయ మహిళా పోలీసులకు సెల్‌ఫోన్ల పంపిణీ

ధర్మవరంరూరల్‌, ఆగస్టు 5: మండలంలోని గ్రామసచివాలయంలో విధులు నిర్వహిస్తున్న 14మంది మహిళ పోలీసులకు ఎంపీడీఓ అశోక్‌కుమార్‌రెడ్డి సెల్‌ ఫోన్లను గురువారం పంపిణీ చేశారు.  ఈ సందర్బంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ప్రజల రక్షణ కోసం ఈ సెల్‌ఫోన్లును వినియోగించుకోవాలని, గ్రామాల్లో జరిగే సంఘటనలపై ఎప్పటికప్పుడూ సమాచారం అందించి పరిష్కారించే విధంగా కృషి చే యాలన్నారు. అదేవిధంగా దిశయాప్‌పై మహిళలకు అవగాహన కల్పించి యువతీలు, మహిళలకు యాప్‌ను డౌనలోడ్‌ చేయించా లన్నారు. ప్రభుత్వం అందించే పథకాలను ప్రజల ముంగిటకే అందేలా చొరవచూపాలన్నారు. కార్యక్ర మంలో గ్రామసచివాలయ మహిళ పోలీసులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-08-06T06:35:01+05:30 IST