పంచాయతీ కార్మికులకు దుప్పట్ల పంపిణీ

ABN , First Publish Date - 2020-10-27T11:03:40+05:30 IST

మండల పరిధిలోని 24 గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న కార్మికులకు ఉమ్మడి జిల్లా డీసీఎమ్‌ఎస్‌ చైర్మన్‌ పట్లా ప్రభాకర్‌ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆదివారం దుప్పట్లను పంపిణీ చేశారు

పంచాయతీ కార్మికులకు దుప్పట్ల పంపిణీ

 రాజాపూర్‌, అక్టోబరు 26: మండల పరిధిలోని 24 గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న కార్మికులకు ఉమ్మడి జిల్లా డీసీఎమ్‌ఎస్‌ చైర్మన్‌ పట్లా ప్రభాకర్‌ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆదివారం దుప్పట్లను పంపిణీ చేశారు. అతంకు ముందు మండల కేంద్రంలోని స్థానిక ముఖ్య కూడలిలో తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక చైర్మన్‌ బాద్మి శివకుమార్‌, టీఆర్‌ఎస్‌ మండల నాయకుల ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ యాదయ్య, ఏఎంసీ చైర్మన్‌ రఘువీరారెడ్డి, వైస్‌ ఎంపీపీ మహిపాల్‌ రెడ్డి, మాజీ ఎంపీపీ నర్సిములు, ఎంపీటీసీ అభిమన్యురెడ్డి, శ్రీశైలం యాదవ్‌, బచ్చిరెడ్డి, నర హరి, నగిరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-27T11:03:40+05:30 IST