పాఠశాల విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ

ABN , First Publish Date - 2022-05-18T06:32:10+05:30 IST

మండలంలోని ఆర్‌డీటీ స్వచ్చంద సేవా సంస్థ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు ఇస్తున్న ప్రోత్సాహకాలు అభినందనీయమని ఎంఈవో పి.ఆంజనేయులు పేర్కొన్నారు.

పాఠశాల విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ
ఆర్‌డీటీ సంస్థ పంపిణీ చేసిన సైకిళ్లతో విద్యార్థులు

ఎర్రగొండపాలెం, మే 17: మండలంలోని ఆర్‌డీటీ స్వచ్చంద సేవా సంస్థ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు ఇస్తున్న ప్రోత్సాహకాలు అభినందనీయమని ఎంఈవో పి.ఆంజనేయులు పేర్కొన్నారు. ఆర్‌డీటీ స్వచ్చంధసంస్థ మంగళవారం ఎర్రగొండపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న 32 మంది విద్యార్థులకు మొత్తం రూ.1.60 లక్షలు విలువైన సైకిళ్లు, క్రీడా పరికరాలు పంపిణీ చేసింది. పాఠశాలకు దూరం నుంచి వచ్చే  విద్యార్థులకు సర్వేచేయించి సైకిళ్లు పంపిణీ చేయించామన్నారు. మండలంలో 10 వతరగతి విద్యార్థులకు గత సంవత్సరం నోట్‌బుక్‌లు గైడ్‌లు పంపిణీ చేయించామన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎం  శామ్యూల్‌ జాన్‌, ఎస్‌ఐ  జి.కోటయ్య, ఆర్‌డీటీ వై.పాలెం కో-ఆర్డినేటరు లక్ష్మణ్‌, ప్రాజెక్టు కో-ఆర్డినేటరు వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు నాగమూర్తి, బ్రహ్మయ్య, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-18T06:32:10+05:30 IST