100 యూనిట్ల పెరటికోళ్ల పంపిణీ
ABN , First Publish Date - 2022-07-01T06:37:15+05:30 IST
గిద్దలూరు నియోజకవర్గంలోని 6 మండలాలకు ఒక్కో మండలానికి 100 యూనిట్ల చొప్పున గురువారం పెరటికోళ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది.
కంభం, జూన్ 30 : గిద్దలూరు నియోజకవర్గంలోని 6 మండలాలకు ఒక్కో మండలానికి 100 యూనిట్ల చొప్పున గురువారం పెరటికోళ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా కంభం మండలానికి 100 యూనిట్లకు పెరిటికోళ్లను ఎంపిపి చేగిరెడ్డి తులసమ్మ, జడ్పీటీసీ సభ్యురాలు కొత్తపల్లి జ్యోతి పంపిణీ చేశారు. ఒక్కొక్క యూనిట్ ధర రూ.4800 కాగా మొత్తం 12 కోళ్లు, 50 కిలోల దాణా, మెడికల్ కిట్, ఒక పెట్టెను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఎంపీపీ మాట్లాడుతూ మహిళలకు పెరటి కోళ్ల పెంపకం అదనపు ఆదాయం ఇస్తుందన్నారు. స్థానిక ఆర్అండ్బీ బంగ్లా ఆవరణలో జరిగిన కార్యక్రమంలో సర్పంచ్లు బోడయ్య, బత్తుల తిరుపాలమ్మ, ఏరియా కోఆర్డినేటర్ చంద్రశేఖర్రెడ్డి, బీపీఎం కృపారావు, ఏపీఎంలు ప్రసాద్, జయరాజ్, సీసీలు తదితరులు పాల్గొన్నారు.
బేస్తవారపేట : బేస్తవారపేట వెలుగు కార్యాలయంలో గురువారం డ్వాక్రా మహిళలకు పెరటి కోళ్లు పంపిణీ చేశారు. మండలంలో 100 యూనిట్ల పెరటి కోళ్లు మంజూరయ్యాయని వెలుగు సీసీ రంగనాయకులు అన్నారు. మహిళ సమాఖ్య ద్వారా ఒక యూనిట్కు రూ.4800 చేల్లిస్తే 12 కోళ్లు, నాలుగు బస్తాల దాణా అందజేశారు. ఈ పెరటి కోళ్ల ద్వారా మహిళలు అర్థికాభివృద్ధి చేందుతారని రంగనాయకులు అన్నారు. కార్యక్రమంలో వెలుగు ఏపీయం రమేష్ బాబు, జడ్పీటీసీ బండ్లమూడి వెంకట రాజయ్య, ప్రేమానంద్ తదితరులు పాల్గొన్నారు.
గిద్దలూరు టౌన్ : ఎస్హెచ్జీ మహిళలకు గురువారం ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో పెరటికోళ్లను పంపిణీ చేశారు. ఎంపీడీవో రంగనాయకులు 100 యూనిట్లను పంపిణీ చేశారు. మండలంలోని ఎస్హెచ్జీ గ్రూపు సభ్యులకు ఈ కోళ్లను పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలో కోళ్లను పంపిణీ చేస్తుండగా కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కడప వంశీధర్రెడ్డి, ఏసీ చంద్రశేఖర్రెడ్డి, డీపీఎం హెచ్డీ విభాగం కృపారావు, ఏపీఎం నరేష్, సీసీలు, ఎస్హెచ్జీ మహిళలు, వీవోఏలు పాల్గొన్నారు.