షటిల్‌ విజేతలకు బహుమతులు పంపిణీ

ABN , First Publish Date - 2021-01-16T05:28:19+05:30 IST

సంక్రాంతి పండుగ సందర్భంగా సుండుపల్లెలోని కేయం ఇండోర్‌ స్టేడియంలో శుక్రవారం మండల స్థాయి షటిల్‌ టోర్నమెంట్‌ నిర్వహించారు.

షటిల్‌ విజేతలకు బహుమతులు పంపిణీ

సుండుపల్లె, జనవరి 15: సంక్రాంతి పండుగ సందర్భంగా సుండుపల్లెలోని కేయం ఇండోర్‌ స్టేడియంలో శుక్రవారం మండల స్థాయి షటిల్‌ టోర్నమెంట్‌ నిర్వహించారు. స్వర్గీయ యర్రపురెడ్డి రవీంద్రారెడ్డి స్మారకార్థం ఏర్పాటు చేసిన టోర్నమెంట్‌ను  ఎస్‌ఐ భక్తవత్సలం  ప్రారంభించారు. టోర్నమెంట్‌ విజేతలకు అజయ్‌రెడ్డి, హర్షవర్థన్‌రెడ్డి, గిరీ్‌షరెడ్డిల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. అబ్దుల్‌ హమీద్‌కు మొదటి బహుమతి కింద రూ.6 వేలు, సూర్య ద్వితీయ బహుమతి రూ.4 వేలు, అప్సల్‌ఖాన్‌ తృతీయ బహుమతి రూ.2వేలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో విజయ్‌కుమార్‌, హరికుమార్‌, చిన్నప్ప, అహమ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-01-16T05:28:19+05:30 IST