ప్రభుత్వ మిగులు భూమిని ఎస్సీలకు పంపిణీ చేస్తాం: కేసీఆర్

ABN , First Publish Date - 2021-08-04T23:16:42+05:30 IST

వాసాలమర్రిలో 100 ఎకరాలకు పైగా మిగులుభూమి ఉందని, ప్రభుత్వ మిగులుభూమిని ఎస్సీలకు పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

ప్రభుత్వ మిగులు భూమిని ఎస్సీలకు పంపిణీ చేస్తాం: కేసీఆర్

వాసాలమర్రి: వాసాలమర్రిలో 100 ఎకరాలకు పైగా మిగులుభూమి ఉందని, ప్రభుత్వ మిగులుభూమిని ఎస్సీలకు పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. వాసాలమర్రిలో సీఎం పర్యటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వాసాలమర్రిలో 76 దళిత కుటుంబాలు ఉన్నాయని తెలిపారు. ఎలాంటి వివాదాలు లేకుండా భూములు సర్వే జరిపిస్తామన్నారు. వాసాలమర్రిలో ఎస్సీల కమతాల ఏకీకరణ కూడా జరగాలన్నారు. రాష్ట్రంలో 16 లక్షల ఎస్సీ కుటుంబాలు ఉన్నాయని కేసీఆర్‌ తెలిపారు. 

Updated Date - 2021-08-04T23:16:42+05:30 IST