దూరవిద్య పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల
ABN , First Publish Date - 2020-06-05T09:25:53+05:30 IST
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం పరిధిలో జూలై నుంచి ప్రారంభం కానున్న యూజీ, పీజీ పరీక్షలకు సంబంధించి ..
ఏఎన్యూ, జూన్4: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం పరిధిలో జూలై నుంచి ప్రారంభం కానున్న యూజీ, పీజీ పరీక్షలకు సంబంధించి పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల చేసినట్లు జాయింట్ రిజిస్ర్టార్ బి.సత్యవతి తెలిపారు. అపరాధ రుసుము లేకుండా ఈనెల 15వ తేదీ లోగా, అపరాధ రుసుము రూ.100తో ఈనెల 20లోగా, తత్కాల్ ఫీజు రూ.500తో ఈనెల 25 తేదీలోగా చెల్లించాలన్నారు. పరీక్ష ఫీజులు తదితర వివరాలను వర్సిటీ వెబ్సైట్ నుంచి పొందవచ్చని ఆమె తెలిపారు.