రాత్రి అదేపనిగా అరుస్తున్న పెంపుడు కుక్క.. బయటకొచ్చిన 65 ఏళ్ల వృద్ధురాలు.. చెట్టువద్ద కనిపించిన సీన్ చూసి..

ABN , First Publish Date - 2021-12-29T20:00:47+05:30 IST

అతను రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు.. తనతో పాటు పెంపుడు కుక్కను కూడా తీసుకెళ్లాడు..

రాత్రి అదేపనిగా అరుస్తున్న పెంపుడు కుక్క.. బయటకొచ్చిన 65 ఏళ్ల వృద్ధురాలు.. చెట్టువద్ద కనిపించిన సీన్ చూసి..

అతను రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు.. తనతో పాటు పెంపుడు కుక్కను కూడా తీసుకెళ్లాడు.. ఎంత సేపటికీ తిరిగి రాలేదు.. చాలా సేపు తర్వాత బయటి నుంచి కుక్క అరుపులు వినిపించాయి.. బయటకు వెళ్లి చూసిన వృద్ధురాలు షాక్ అయింది.. కొడుకు ఓ చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు.. మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. 


సాగర్ జిల్లాలోని ఛత్తర్‌పూర్ గ్రామానికి చెందిన కమలేష్ అనే వ్యక్తి తన తల్లి శాంతితో కలిసి నివసిస్తున్నాడు. తల్లి, కొడుకు మధ్య సోమవారం రాత్రి పెంపుడు కుక్క గురించి గొడవ జరిగింది. సోమవారం ఉదయం శాంతిని పెంపుడు కుక్క కరిచేసింది. దీంతో ఆ కుక్కను బయట వదిలేసి రమ్మని కొడుకుతో శాంతి వాగ్వాదానికి దిగింది. కుక్కతో ఎంతో అనుబంధం పెంచుకున్న కమలేష్ అందుకు నిరాకరించాడు. 


దీంతో తల్లి, కొడుకు మధ్య సోమవారం రాత్రి పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవ తర్వాత కమలేష్ ఆగ్రహంగా బయటకు వెళ్లిపోయాడు. అతని వెనకాలే పెంపుడు కుక్క కూడా వెళ్లిపోయింది. కుక్క మెడలో ఉన్న గొలుసు తీసి కమలేష్ చెట్టుకు ఉరేసుకున్నాడు. కమలేష్ అచేతనంగా మారిపోవడం చూసి పెంపుడు కుక్క అరవడం మొదలుపెట్టింది. ఆ అరుపులు వల్లే శాంతికి కొడుకు ఆత్మహత్య గురించి తెలిసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2021-12-29T20:00:47+05:30 IST