దిశ కమిషన్ ముందు హాజరైన సజ్జనార్
ABN , First Publish Date - 2021-10-04T22:57:07+05:30 IST
దిశ కమిషన్ ముందు హాజరైన సజ్జనార్
హైదరాబాద్: దిశ కమిషన్ ముందు సజ్జనార్ హాజరయ్యారు. మరోసారి విచారణకు హాజరుకావాలని సజ్జానార్కు కమిషన్ ఆదేశించింది. సజ్జనార్తో పాటు కమిషన్ ముందు క్లూస్ టీం వెంకన్న కూడా హాజరయ్యారు. ఘటన స్థలంలో దొరికిన ఆధారాలపై క్లూస్ టీం వెంకన్న నివేదిక సమర్పించారు. ఎన్కౌంటర్ జరిగిన సమయంలో నిందితుల చేతిలో ఆయుధాలు ఉన్నాయా?, వాటిపై నిందితుల వేలి ముద్రలు సేకరించారా? అని ప్రశ్నించింది. ఎన్కౌంటర్ జరిగిన స్థలానికి వెళ్లి పంచనామా చేసిన రెవెన్యూ అధికారిని కూడా కమిషన్ విచారించింది. ఈనెల 7న హాజరుకావాలని సజ్జనార్కు సిర్పుకర్ కమిషన్ ఆదేశించింది.