తీర భద్రతపై ఒడిశాలో చర్చలు
ABN , First Publish Date - 2022-08-11T08:37:21+05:30 IST
తీర భద్రతపై ఒడిశాలో చర్చలు
విశాఖపట్నం, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): తీర ప్రాంత భద్రతపై తూర్పు నౌకాదళం ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్గుప్తా.. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్తో చర్చించారు. సీఎం ఆహ్వానం మేరకు బుధవారం ఒడిశా వెళ్లిన ఈఎన్సీ చీఫ్.. ఆ రాష్ట్ర అపెక్స్ కమిటీతో తీర ప్రాంత భద్రతపై చర్చించారు. భద్రతా అంశాలపై ఒడిశా ప్రభుత్వం సహకారం అర్థించారు.