ప్రాజెక్టుల అప్పగింతపై ఏపీ ఇరిగేషన్ వర్గాల్లో తర్జనభర్జన

ABN , First Publish Date - 2021-10-14T22:08:16+05:30 IST

గెజిట్ ప్రకారం బోర్డులకు ప్రాజెక్టుల అప్పగింతపై ఏపీ ఇరిగేషన్ వర్గాల్లో తర్జనభర్జన మొదలైంది. గెజిట్ ప్రకారం ప్రాజెక్టుల అప్పగింతకు తెలంగాణ ససేమిరా అంటోంది.

ప్రాజెక్టుల అప్పగింతపై ఏపీ ఇరిగేషన్ వర్గాల్లో తర్జనభర్జన

అమరావతి: గెజిట్ ప్రకారం బోర్డులకు ప్రాజెక్టుల అప్పగింతపై ఏపీ ఇరిగేషన్ వర్గాల్లో తర్జనభర్జన మొదలైంది. గెజిట్ ప్రకారం ప్రాజెక్టుల అప్పగింతకు తెలంగాణ ససేమిరా అంటోంది. తమ వైపు నుంచి ఏం చేయాలనే దానిపై ఏపీ మల్లగుల్లాలు పడుతోంది. విద్యుత్ కేంద్రాలు, ఆఫ్‌టేక్ ప్రాజెక్టులను తెలంగాణ అప్పగిస్తేనే.. ప్రాజెక్టులు అప్పగించే ప్రక్రియని మొదలుపెట్టాలని ఏపీ ఇరిగేషన్ శాఖ భావిస్తోంది. సీఎంతో చర్చించిన తర్వాత ప్రాజెక్టుల అప్పగింతపై జగన్ సర్కార్ ముందడుగు వేయనుంది. 


Updated Date - 2021-10-14T22:08:16+05:30 IST