కొంతకాలంగా చర్చిస్తున్నా..
ABN , First Publish Date - 2021-09-17T07:33:21+05:30 IST
కోహ్లీ నిర్ణయం వెలువడిన అనంతరం బీసీసీఐ కార్యదర్శి జై షా ఓ ప్రకటన చేశాడు.
కోహ్లీ నిర్ణయం వెలువడిన అనంతరం బీసీసీఐ కార్యదర్శి జై షా ఓ ప్రకటన చేశాడు. కెప్టెన్సీ విషయమై కొంతకాలంగా విరాట్తో చర్చిస్తున్నట్టు తెలిపాడు. ‘భారత జట్టుకు సంబంధించి మాకు స్పష్టమైన రోడ్ మ్యాప్ ఉంది. పనిభారాన్ని పరిశీలించాక నాయకత్వ మార్పు ప్రక్రియ సాఫీగా సాగుతుందని నిర్ధారణకు వచ్చాం. ప్రపంచ కప్ తర్వాత టీ20 జట్టు కెప్టెన్సీనుంచి వైదొలగాలని విరాట్ నిర్ణయించుకున్నాడు. కోహ్లీతోపాటు నాయకత్వ గ్రూపుతో గత ఆరు నెలలుగా చర్చిస్తున్నా. అందువల్ల అతను బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయమిది. ఆటగాడిగా విరాట్ తన సేవలు అందిస్తాడు. సీనియర్ క్రికెటర్గా భారత క్రికెట్ అభివృద్ధిలో పాలుపంచుకుంటాడు’ అని షా తెలిపాడు.