తాత్కాలిక సిబ్బందిపై వివక్ష

ABN , First Publish Date - 2020-07-13T10:42:13+05:30 IST

ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న నాలుగో తరగతి ఉద్యోగుల జీతాల్లో 10 శాతం మాత్రమే కటింగ్‌ చేస్తుండగా ..

తాత్కాలిక సిబ్బందిపై వివక్ష

పర్యాటక విభాగంలో ఆవేదన


హైదరాబాద్‌ సిటీ, జూలై 12 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న నాలుగో తరగతి ఉద్యోగుల జీతాల్లో 10 శాతం మాత్రమే కటింగ్‌ చేస్తుండగా పర్యాటక అభివృద్ధి సంస్థలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 220 మంది కాంట్రాక్టు, 280 మంది ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది వేతనాల్లో మార్చి, ఏప్రిల్‌, మే, జూన్‌ వేతనాల్లో 50 శాతం కోత విధించి  చెల్లిస్తున్నారు. ఇందులోనే 10 శాతం పీఎఫ్‌ కటింగ్‌ చేస్తుండడంతో వారు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. అధిక జీతం ఉన్న వారు సర్ధుకుపోతున్నారని, రూ. 10 నుంచి రూ.14 వేలు వచ్చే వారికి సగం జీతమే ఇస్తుండడంతో అప్పు కోసం ఎదురుచూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


సంస్థలో పనిచేస్తున్న తాత్కాలిక సిబ్బందికి 100 శాతం వేతనాలు ఇవ్వాలని టూరిజం శాఖ మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ కొద్దిరోజుల క్రితం అధికారులను ఆదేశించినప్పటికీ నిర్వహణ సాకును చూపించి తమను అవస్థలకు గురిచేస్తున్నారని చెబుతున్నారు. ఆపద కాలంలో వినియోగించుకునే పర్యాటక శాఖ నిధుల నుంచి కొంత తీసుకుని 100 శాతం వేతనాలు ఇవ్వాలని, లేకపోతే రానున్న రోజుల్లో తమ పరిస్థితి దుర్భరంగా మారనుందని వారు పేర్కొంటున్నారు.

Updated Date - 2020-07-13T10:42:13+05:30 IST