కరోనా బాధితుల పట్ల వివక్ష తగదు
ABN , First Publish Date - 2020-08-04T10:56:10+05:30 IST
కరోనా బాధితుల పట్ల వివక్ష తగదంటూ సోమవారం మండలంలోని కాప్పల్లె పంచాయతీ బైరాజుపల్లె, గజ్జలవారిపల్లెలో అవగాహన ..
రామసముద్రం, ఆగస్టు 3: కరోనా బాధితుల పట్ల వివక్ష తగదంటూ సోమవారం మండలంలోని కాప్పల్లె పంచాయతీ బైరాజుపల్లె, గజ్జలవారిపల్లెలో అవగాహన ర్యాలీలు నిర్వహించారు. మదనపల్లెకు చెందిన కరోనా బాధిత బంధుమిత్ర కమిటీ సభ్యులు మాట్లాడుతూ... కరోనాతో మృతిచెందిన ఆప్తుల అంత్యక్రియలకు సొంత కుటుంబీకులే దూరంగా ఉండటం బాధాకరమని వాపోయారు. అవసరమైతే తామే మృతదేహాలను ఖననం చేయడంలో సాయపడతామని పేర్కొన్నారు. పలుసంఘాల ప్రతినిధులు బాబూరాజేంద్రప్రసాద్, ఖాదర్వలి, అంజలి, గౌస్బాషా, రాయల్బాబు, పఠాన్ఖాదర్, హతావుల్లా పాల్గొన్నారు.