గాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాల ఆవిష్కరణ

ABN , First Publish Date - 2022-01-27T04:35:52+05:30 IST

మండలంలోని పాతముడివేముల ప్రాథమికోన్నత పాఠశాలలో వాసవీక్లబ్‌ ఇంటర్నేషనల్‌ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ, పొట్టి శ్రీరా ములు విగ్రహాలను గణతంత్ర దినోత్సవం సందర్బంగా బుధవారం ఆవిష్కరించారు.

గాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాల ఆవిష్కరణ

త్రిపురాంతకం, జనవరి 26 : మండలంలోని పాతముడివేముల ప్రాథమికోన్నత పాఠశాలలో వాసవీక్లబ్‌ ఇంటర్నేషనల్‌ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ, పొట్టి శ్రీరా ములు విగ్రహాలను గణతంత్ర దినోత్సవం సందర్బంగా బుధవారం ఆవిష్కరించారు. ఈసందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకుని అన్ని రంగాల్లో రాణించాలని, గ్రామానికి, తల్లిదండ్రులకు మంచిపేరు తేవాలని, ఉ న్నత శిఖరాలకు ఎదగాలని అన్నారు. కార్యక్రమంలో వాసవీక్లబ్‌ ప్రతినిధులు తులసిస్వప్న, గోళ్ల వెంకట సుబ్బారావు, నారాయణ, సర్పంచ్‌ దర్శి రాధాకృష్ణ, మునీంద్ర, కె.హనుమంతరావు, మధు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-27T04:35:52+05:30 IST