విద్యార్థికి క్రమశిక్షణ అవసరం: పవన్‌కుమార్‌

ABN , First Publish Date - 2020-02-20T05:46:18+05:30 IST

ప్రతి విద్యార్థికి క్రమశిక్షణతో పాటు ఉన్నత లక్ష్యం అవసరమని పాలమూరు యూనివర్శిటీ రిజిస్ట్రార్‌ పి. పవన్‌కుమార్‌ పేర్కొన్నారు. షాద్‌నగర్‌ వివేకానంద డిగ్రీ కళాశాల వార్షికోత్స

విద్యార్థికి క్రమశిక్షణ అవసరం: పవన్‌కుమార్‌

షాద్‌నగర్‌అర్బన్‌: ప్రతి విద్యార్థికి క్రమశిక్షణతో పాటు ఉన్నత లక్ష్యం అవసరమని పాలమూరు యూనివర్శిటీ రిజిస్ట్రార్‌ పి. పవన్‌కుమార్‌ పేర్కొన్నారు. షాద్‌నగర్‌ వివేకానంద డిగ్రీ కళాశాల వార్షికోత్సవ కార్యక్రమం బుధవారం స్థానిక శివదత్తగార్డెన్‌లో జరిగింది. కళాశాల ప్రిన్సిపల్‌ ఎస్‌. గోపాల్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పవన్‌కుమార్‌ మాట్లాడుతూ విద్యార్థులకు డిగ్రీ విద్య ఎంతో ముఖ్యమని అన్నారు. జీవిత లక్ష్యాన్ని ఎంచుకుని క్రమశిక్షణతో చదివితే ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి ఎదుగుతారని అన్నారు. వివేకానంద విద్యా సంస్థల కార్యదర్శి ఎన్‌. శ్రీవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ దేశం కోసం జీవితాలను త్యాగం చేసిన మహానీయులను ఆదర్శంగా తీసుకుని ప్రతి విద్యార్థి ముందుకు సాగాలని కోరారు. విద్యార్థి దశ నుంచి క్రమశిక్షణను, దేశభక్తిని అలవర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీనియర్‌ జర్నలిస్టు రాగ సుధాకర్‌, కరుణాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-02-20T05:46:18+05:30 IST