లైన్ దాటితే క్రమశిక్షణ చర్యలు: మల్లు రవి

ABN , First Publish Date - 2022-03-22T00:43:54+05:30 IST

కాంగ్రెస్ పార్టీలో లైన్ దాటితే క్రమశిక్షణ చర్యలు తప్పవని ఆ పార్టీ నేత

లైన్ దాటితే క్రమశిక్షణ చర్యలు: మల్లు రవి

హైదరాబాద్‌: కాంగ్రెస్ పార్టీలో లైన్ దాటితే క్రమశిక్షణ చర్యలు తప్పవని ఆ పార్టీ నేత మల్లు రవి అన్నారు. ABNతో ఆయన మాట్లాడారు. పీసీసీపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు. ఏమైనా ఉంటే పార్టీలో అంతర్గతంగా చర్చించుకోవాలన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్ ప్రత్యామ్నాయం అనే స్థాయిలో ఎదుగుతుందన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలను రేవంత్ ఆకర్షిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో పార్టీలో అలజడులు మంచిది కాదని ABNతో మాట్లాడుతూ ఆయన అన్నారు. 

Updated Date - 2022-03-22T00:43:54+05:30 IST