24 గంటల్లో డిశ్చార్జ్!
ABN , First Publish Date - 2020-06-07T06:53:26+05:30 IST
కరోనా వ్యాప్తికి మరింత ఆజ్యం పోసే నిర్ణయాన్ని కేజ్రీవాల్ సర్కారు తీసుకుంది. కొవిడ్-19 రోగుల్లో కొద్దిపాటి లక్షణాలు ఉంటే, అసలు ఏ లక్షణాలూ లేకుంటే వారిని 24 గంటల తర్వాత
- ఆస్పత్రులకు ఢిల్లీ సర్కారు ఆదేశాలు
కరోనా వ్యాప్తికి మరింత ఆజ్యం పోసే నిర్ణయాన్ని కేజ్రీవాల్ సర్కారు తీసుకుంది. కొవిడ్-19 రోగుల్లో కొద్దిపాటి లక్షణాలు ఉంటే, అసలు ఏ లక్షణాలూ లేకుంటే వారిని 24 గంటల తర్వాత డిశ్చార్జ్ చేసి, ఇంట్లోనే ఐసోలేషన్లో ఉండాల్సిందిగా సూచించాలని ఆస్పత్రులను ఆదేశించింది. అలా డిశ్చార్జ్ అయ్యే వారి వివరాలను జిల్లా నిఘా అధికారులకు తెలపాలని పేర్కొంది. తమ ఆజ్ఞలను ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణించి, ఎలాంటి నోటీసూ లేకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. ఒకవేళ పేషెంట్ల ఇంట్లో హోం ఐసోలేషన్కు తగిన సౌకర్యాలు లేకుంటే ప్రభుత్వం నిర్వహించే కొవిడ్ కేంద్రాలకు తరలించాలని పేర్కొంది. ‘‘ఆస్పత్రులను కేవలం తీవ్రలక్షణాలతో బాధపడుతూ.. బీపీ, షుగర్, హృద్రోగాలున్న కరోనా పేషెంట్లకు మాత్రమే కేటాయించాలి’’ అని ఢిల్లీ కొవిడ్-19 టాస్క్ఫోర్స్ చైర్మన్ డాక్టర్ ఎస్కే సరీన్ పేర్కొన్నారు.