‘రాష్ట్రంలో రైతులకు విపత్కర పరిస్థితులు’

ABN , First Publish Date - 2021-09-17T06:03:04+05:30 IST

రాష్ట్రంలో మునుపెన్నడూ లేనివిధంగా రైతులు విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు అన్నారు.

‘రాష్ట్రంలో రైతులకు విపత్కర పరిస్థితులు’
సమావేశంలో మాట్లాడుతున్న ప్రగడ నాగేశ్వరరావు



ఎలమంచిలి, సెప్టెంబరు 16: రాష్ట్రంలో మునుపెన్నడూ లేనివిధంగా రైతులు విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు అన్నారు. గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వర్షాలు కురిసినా సాగునీటి కాలువలు, డ్రైన్‌లలో పూర్తిస్థాయిలో పూడిక తీయకపోవడం వల్లే సరిగా నీరందే పరిస్థితి లేదన్నారు. పంటలకు మద్దతు ధరలు దక్కకపోగా, విద్యుత్‌ మోటార్లకు మీటర్లు బిగించి మరింత అవస్థలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఎవరూ అధైర్య పడవద్దని, ఎల్లప్పుడూ టీడీపీ అం డగా నిలుస్తుందని చెప్పారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి రంగనాయకులు, నాయకులు దిన్‌బాబు, గొర్లె నానాజీ, రమణబాబు, రాజు, కొఠారు సాంబ, ఆడారి ఆదిమూర్తి, కౌన్సిలర్‌ మజ్జి కృష్ణ, మాజీ కౌన్సిలర్‌ నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-17T06:03:04+05:30 IST